telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

బ్రాహ్మణులకు ఆర్థిక భరోసా ఇవ్వాలి: పవన్ కల్యాణ్

pawan

ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులను సక్రమంగా వినియోగించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ మేరకు ఈ రోజు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పౌరోహిత్యంపై ఆధారపడ్డ బ్రాహ్మణులకు ఆర్థిక భరోసా ఇవ్వాలని ప్రకటనలో పేర్కొన్నారు.

పౌరోహిత్యంపై ఆధారపడ్డవారు ఎదుర్కొంటున్న కష్టాలను ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సవివరంగా తెలియజేసిందని ఆయన తెలిపారు. కరోనా విపత్కర సమయంలో పురోహితులకు నెలకు రూ.5 వేలు, నిత్యావసర సరుకులు అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

Related posts