ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. సమావేశాలకు హాజరయ్యేందుకు టీడీపీ నేతలు నల్లచొక్కాలతో వెళ్లారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనపై అసెంబ్లీలో ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని టీడీపీ ఎమ్మెల్యేలు మీడియాకు వెల్లడించారు.
గతంలో అడ్డుకున్న బిల్లులను మరోసారి ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. ఏపీలో ల్యాండ్, శాండ్ మాఫియాలపై నిలదీస్తామని తెలిపారు. కేవలం బడ్జెట్ను ఆమోదించుకోవడం కోసమే ఈ సమావేశాలు జరపాలని ప్రభుత్వం ప్రయత్నాలు జరుపుతోందని అన్నారు. ఏడాది కాలంలో రాష్ట్రంలో ఏ ప్రాజెక్టులు ముందుకు కదలలేదని విమర్శించారు. కరోనా నేపథ్యంలో బాధితులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వవ విఫలమైందని చెప్పారు.
ఆ సీఐకి అన్నీ తెలుసు..వివేకా కూతురు