telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్‌ నిజమైన హిందువైతే అది చేయాలి : రఘునందన్‌రావు సవాల్‌

Raghunandan

భద్రాద్రి రాముని సన్నిధిలో కేసిఆర్ ప్రభుత్వం పై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాదిన నిర్మిస్తున్న రామా మందిరాన్ని భద్రాద్రి రాములోరి ఆశీస్సులతో త్వరలోనే పూర్తి చేసుకుంటామని తెలిపారు. తన కంటే హిందువు లేడు… తానే పెద్ద హిందువును అని కేసిఆర్ భావిస్తున్నాడని.. భద్రాచలం దేవాలయానికి కేసిఆర్ ప్రభుత్వం 100 కోట్లు ప్రకటించి ఏండ్లు గడుస్తున్న ఇప్పటికి ఆ మాటను గుర్తుంచుకోక పోవటం బాధకరమన్నారు. రామాలయానికి ఇస్తానన్న 100 కోట్ల విలువ….కేసిఆర్ కట్టిన ప్రగతి భవనం, కవిత అడిన బతుకమ్మ అంత ఖరీదు కాదని పేర్కొన్నారు. కేసిఆర్ నిజంగా హిందువు అయితే…భద్రాద్రి రామాయ్యకి 100 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తనకు చేత కాదని.. చేతిలేత్తినట్లయితే కేంద్ర ప్రభుత్వం సహాయంతో నెలరోజుల్లో రామాలయానికి 100 కోట్లు తెస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభ్యుత్వానికి రాముడి పట్ల, మందిరాల పట్ల నిజంగా చిత్తశుద్ది ఉంటే కేసిఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత రాములోరి దర్శనానికి వచ్చారా…?అని ప్రశ్నించారు. రెండు సంవత్సరాలు పూర్తి అయిన పోడు భూముల సమస్య తీర్చకపోవటం బాధకరమన్నారు. నాగార్జున సాగర్ నియోజవర్గంలో గుర్రంపోడుకి బిజెపి పార్టీ గిరిజనుల హక్కుల కోసం వెళితే మాపై క్రిమినల్ కేసులు నమోదు చేపించాడు ఈ కేసిఆర్ అని నిప్పులు చెరిగారు.

Related posts