telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

గ్రేటర్ ఎన్నికల సందర్బంగా ఓ వీడియో విడుదల చేసిన కమిషనర్…

ప్రస్తుతం తెలంగాణ మాత్రమే కాకుండా… మొత్తం దేశమంతా గ్రేటర్ ఎన్నికల వైపే చూస్తుంది. అయితే తాజాగా ఈ ఎన్నికల పై సిటీ పోలీస్‌ కమిషనర్ అంజనీకుమార్ స్పందించారు. ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి.. హైదరాబాద్‌, ప్రజలు శాశ్వతం అన్నారు అంజనీకుమార్… గ్రేటర్‌ ఎన్నికల సమయంలో సోషల్ మీడియా వేదికగా జరుగుతోన్న ప్రచారంపై స్పందిస్తూ.. ఓ వీడియోను విడుదల చేసిన సీపీ… ఎన్నికల సమయంలో చాలా మంది వస్తున్నారు.. హైదరాబాద్‌లో ఏడో జరగబోతోంది అనే తరహాలో ప్రచారం చేస్తున్నారు.. మత ఘర్షణలు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.. నగర ప్రజలు సోషల్ మీడియాలో జరిగే అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేసిన సిటీ పోలీస్ కమిషనర్.. మత ఘర్షణలు, లా అండ్ ఆర్డర్‌కు ఇబ్బంది కలిగించే వాళ్లపై పీడీ యాక్ట్‌లు పెడతామని హెచ్చరించారు… నగరంలో ఎలాంటి ఘటనలు జరిగినా భారీ మూల్యం తప్పదు అని సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారలకు వార్నింగ్ ఇచ్చారు. 

Related posts