telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పూలే స్ఫూర్తితోనే బీసీల అభ్యున్నతికి టీడీపీ కృషి: చంద్రబాబు

chandrababu

నేడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ఆయనను స్మరించుకున్నారు.టీడీపీ స్థాపనకు స్ఫూర్తి ప్రదాతల్లో జ్యోతిరావు పూలే ఒకరని చంద్రబాబు పేర్కొన్నారు. పూలే స్ఫూర్తితోనే బీసీల అభ్యున్నతికి ఆది నుంచి టీడీపీ కృషి చేస్తోందని చంద్రబాబు వెల్లడించారు.

తెలుగుదేశం పార్టీ స్థాపనకు స్ఫూర్తి ప్రదాతల్లో ఒకరు మహాత్మా జ్యోతిరావు పూలే. ఎన్నో సామాజిక సంస్కరణలకు నాంది పలికి, సమసమాజ స్థాపనకై తన జీవితాన్ని అంకితం చేసిన ఆ మహానుభావుని స్ఫూర్తితోనే బీసీల అభ్యున్నతికి ఆది నుంచీ తెలుగుదేశం. కృషిచేస్తోందని పేర్కొన్నారు.

బీసీలకు రాజ్యాధికారంలో సముచిత భాగస్వామ్యం కల్పించిన పార్టీ తెలుగుదేశం. ఎన్నికల్లో బీసీలకు 1987నుంచి 27%, 1995నుంచి 34% రిజర్వేషన్లు ఇచ్చింది తెలుగుదేశమే. అలాంటిది ఈరోజు వైసీపీ కుట్రల కారణంగా, స్థానికఎన్నికల్లో బీసీలు కేవలం 24% రిజర్వేషన్ తో సరిపెట్టుకోవాల్సిరావడం బాధాకరమన్నారు.మహాత్మా పూలే జయంతి సందర్భంగా ఆ మహానుభావుని స్మృతికి నివాళులు’’ అని చంద్రబాబు ట్వీట్‌లో పేర్కొన్నారు.

Related posts