పరిశ్రమల శాఖపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిర్ణీత గడువు లోపల కార్యకలాపాలు ప్రారంభించకపోతే కంపెనీలకు ఇచ్చిన భూములు వెనక్కి తీసుకుంటామని హెచ్చరించారు.
ఇప్పటికే భూములు పొంది కార్యకలాపాలు ప్రారంభించని కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని మంత్రి ఆదేశించారు. హైదరాబాద్ ఫార్మా సిటీ కాలుష్య రహితంగా ఉండబోతుందని ఆయన పేర్కొన్నారు.