నేడు ఎన్ఆర్సీ బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మమతా బెనర్జీ తమ రాష్ట్రంలో ఎన్ఆర్సీ(నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజెన్స్)ని అనుమతించబోమని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ఆర్సీని బెంగాల్లో జరగనిచ్చేది లేదని సీఎం తేల్చి చెప్పారు. కుల, మతాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టే ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని సీఎం మమతా బెనర్జీ కేంద్రాన్ని పరోక్షంగా హెచ్చరించారు.
ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. అస్సాంలో లాగానే అన్ని రాష్ట్రాలలోను ఎన్ఆర్సీ చేపడతామని పునరుద్ఘాటించారు. ఆయన వ్యాఖ్యలకు బదులుగా ఆమె పై విధంగా స్పందించారు.