telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమరావతి ప్రజలు చంద్రబాబును తిరస్కరించారు: మంత్రి అవంతి

avanthi srinivas minister ap

అభివృద్ధి చేయలేదనే అమరావతి ప్రజలు చంద్రబాబును తిరస్కరించారని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అమరావతి ప్రజలను మోసం చేశారని.. తాజాగా ప్రతిపక్ష నేత హోదాలో మళ్లీ మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు డబ్బులు పెట్టి అమరావతి ఉద్యమాన్ని నడిపిస్తున్నారని అన్నారు. చంద్రబాబు మాదిరిగా ప్రజలకు ఆశలు చూపడం జగన్ కు సాధ్యం కాదన్నారు.

టీడీపీ హయాంలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకుంటుందన్నారు. రాజధాని విషయంలో అసెంబ్లీలో చర్చ జరుపుతామంటూ.. ఈ ప్రక్రియ అంతా పద్ధతి ప్రకారం జరుగుతుందన్నారు. వెనుకబడ్డ ప్రాంత అభివృద్ధికి తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని అడ్డుకోవడం దారుణమన్నారు.

Related posts