జమ్మూకశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో వ్యాప్తంగా విధించిన 144 సెక్షన్ ను ఈ సాయంత్రం ఎత్తివేశారు. జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుతో పాటు, రాష్ట్ర విభజన చేయడంతో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటాయని భావించి 144 సెక్షన్ విధించారు.
కశ్మీర్ లోయలో చాలావరకు సాధారణ ప్రశాంత జీవనం దర్శనమివ్వడంతో ఆంక్షలను సడలించారు. కాలేజీలు, పాఠశాలలు రేపు తెరుచుకోనున్నాయి. క్రమంగా జమ్మూకశ్మీర్ లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని కేంద్రం భావిస్తోంది. అందుకే త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామంటూ ప్రధాని మోదీ కూడా తెలిపారు.