telugu navyamedia
రాజకీయ వార్తలు

ఉగ్ర జాబితా సవరించిన పాక్ ..1800 మంది పేర్ల తొలగింపు!

Imran

ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు తలమునకలవుతుంటే పాకిస్థాన్ మాత్రం ఇదే అదనుగా నిషిద్ధ ఉగ్రవాదుల జాబితాను సవరించింది. 2008 ముంబై దాడి ఘటనకు ప్రధాన సూత్రధారి, లష్కరే కమాండర్‌ జకీవుర్‌ రెహ్మాన్‌ లఖ్వీ సహా 1800 మంది ఉగ్రవాదుల పేర్లను పాకిస్తాన్‌ తన నిఘా జాబితా నుంచి తొలగించింది. వాస్తవానికి ఈ జాబితాను ఇప్పటికిప్పుడు సవరించాల్సినంత తీవ్ర పరిస్థితులు ఏమీలేవు. రెండేళ్ల కిందట నిషిద్ధ ఉగ్రవాదుల జాబితాలో 7,600 మంది పేర్లున్నాయి. ఇప్పుడా జాబితాలో ఉన్న ఉగ్రవాదుల సంఖ్య 3,800 మాత్రమేనంటే పాక్ ఎన్ని విడతలుగా సవరించిందో అర్థమవుతోంది.

ఉగ్రవాదులకు అడ్డాగా మారిందన్న ఆరోపణల నేపథ్యంలో పాక్ పై ఎఫ్ఏటీఎఫ్ (ప్రపంచ ఆర్థిక చర్యల టాస్క్ ఫోర్స్) అసంతృప్తితో ఉంది. పాక్ తీరు ఇదేవిధంగా ఉంటే మరికొన్నాళ్లలో పాక్ ను ఎఫ్ఏటీఎఫ్ బ్లాక్ లిస్టులో చేర్చడం తథ్యమన్న వార్తల నేపథ్యంలో, పాక్ దొంగచాటుగా నిషిద్ధ ఉగ్రవాదుల జాబితాను సవరించినట్టు తెలుస్తోంది. పాక్ నిషిద్ధ ఉగ్రవాదుల జాబితాను సవరించిన విషయాన్ని అమెరికాకు చెందిన కాస్టెల్లమ్.ఏఐ అనే స్టార్టప్ సంస్థ వెల్లడించింది.

Related posts