telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఒవైసీ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చిన కిషన్ రెడ్డి

kishanreddy on ap capital

హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తారన్న ఒవైసీ వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. హైదరాబాద్ ను గాని మరే నగరాన్ని కానీ యూటీ చేయబోమని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ సహా అన్ని నగరాలను అభివృద్ధి చేస్తామని… కేసీఆర్ నిజస్వరూపం ప్రజలకు ఇప్పుడు బాగా అర్థం అయిందని ఫైర్‌ అయ్యారు. ఎంఐఎంతో పొత్తు లేదని జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేసి, అదే ఎంఐఎంతో మేయర్ అయ్యారని విమర్శించారు. ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ అపవిత్ర పొత్తును ఊరూరికి తీసుకువెళ్తామని…ఈ పొత్తుపై కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణాను వ్యతిరేకించిన పార్టీ మజ్లీస్ అని… తెలంగాణ కోసం బలిదానాలు అయిన వారి ఆత్మ ఘోసించేలా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నిధులు, నియామకాలు ఎక్కడకు పోయాయని.. సీఎం పదవిని చెప్పుతో పోల్చి కేసీఆర్‌ పవిత్ర రాజ్యాంగాన్ని, ఓటును అవమానించారని నిప్పులు చెరిగారు. ghmcని అప్పుల ఊబిలో ఉంచారని.. trs పార్టీ పని అయిపోయింది,trs అండతో గెలవాలని అనుకునే వాళ్లకు నేను చెప్పేది ఒక్కటే,వాళ్ళకే గతి లేదు వారి మద్దతుతో మీరేమి గెలుస్తారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఖాయమన్నారు.

Related posts