టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తండ్రి శివలింగ ప్రసాద్ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ శివారులో ఇటీవల వెలుగు చూసిన మంచిరేవుల పేకాట కేసులో పోలీసులు ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణను ముమ్మరం చేసిన పోలీసులు నాగశౌర్య తండ్రిని అదుపులోకి తీసుకుని ఉప్పర్పల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు.
క్యాసినో కింగ్పిన్ గుత్తా సుమన్తో కలిసి శివలింగప్రసాద్ పేకాట దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. దీంతో ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో శివలింగ ప్రసాద్ తరపు న్యాయవాది కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
కాగా… ఫామ్ హౌస్ పేకాట కేసు కీలక మలుపు తిరిగింది. ఇప్పటివరకు ఈ కేసులో గుత్తా సుమనే కింగ్పిన్ అనుకుంటే మరో కీలక వ్యక్తి తెరపైకి వచ్చాడు. ఈ పేకాట దందాలో పోలీసులు సేకరించిన ఆధారాలతో హీరో నాగశౌర్య తండ్రి పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
సిటీ శివారులోని నాగశౌర్య ఫామ్హౌస్లో ఓ రేంజ్లో పేకాట నిర్వహించిన ఘనుడు గుత్తా సుమన్ కుమార్. ఆ రోజు మొత్తం 30మంది వరకూ పట్టుబడ్డారు. శ్రీరామ్ భద్రయ్య లాంటి మాజీ ఎమ్మెల్యేలతో పాటు.. నిజామాబాద్, విజయవాడ లాంటి ప్రాంతాల నుంచి వచ్చిన బడాబాబులూ కూడా అందులో ఉన్నారు.
విజయ్ దేవరకొండతో లిప్ లాక్… స్పందించిన రష్మిక