శర్వానంద్, రీతూవర్మ జంటగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకార్తీక్ దర్శకుడు. ఎస్.ఆర్.ప్రకాశ్బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మాతలు. ఈ సినిమా రెండో షెడ్యూల్ శుక్రవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ఇందులో అమల అక్కినేని శర్వానంద్ తల్లిపాత్రలో, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ తండ్రి రవి రాఘవేంద్ర తండ్రి పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతోంది. శర్వానంద్, అమల, రవి రాఘవేంద్రలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. “స్నేహం, ప్రేమ మధ్య ఉండే విడదీయరాని బంధం గురించి తెలిపే చిత్రమిది. 2020 సమ్మర్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని నిర్మాతలు చెప్పారు. వెన్నెలకిషోర్, నాజర్, ప్రియదర్శి తదితరులు నటిస్తున్నారు.
హీరోలు, టెక్నిషియన్ లు పారితోషికం తగ్గించుకోవాలంటున్న దర్శకుడు