పవర్స్టార్ పవన్ కల్యాణ్ సినిమా అధికారికంగా ఖరారైంది. బాలీవుడ్ చిత్రం `పింక్`ను తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. బాలీవుడ్లో అమితాబ్ చేసిన లాయర్ పాత్రలో పవన్కల్యాణ్ నటించనున్నారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్, టాలీవుడ్ నిర్మాత దిల్రాజు నిర్మిస్తున్నారు. `ఓ మై ఫ్రెండ్`, `ఎంసీఏ` చిత్రాల దర్శకుడు వేణు శ్రీరామ్ సినిమాను డైరెక్ట్ చేయన్నారు. 2018లో విడుదలైన `అజ్ఞాతవాసి` తర్వాత పవన్కల్యాణ్ మళ్లీ సినిమాల్లో నటించలేదు. ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు మళ్లీ పవన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుండటం ఆయన అభిమానులకు శుభవార్తే.
BIGGG NEWS… After remaking #Pink in #Tamil, Boney Kapoor joins hands with Dil Raju to remake #Pink in #Telugu… The #Telugu remake will star Pawan Kalyan… Directed by Sriram Venu… Pawan Kalyan was last seen in #Agnyaathavaasi [2018].
— taran adarsh (@taran_adarsh) 2 November 2019