ఐక్యరాజ్యసమితిలో భారత్ కు శాశ్వత స్థానంపై కృషి జరుగుతుంది. అయితే ఇప్పటివరకు ఆ స్థాయిని దక్కించుకోలేకపోవటం విచారకరం. తాజాగా, కీలక విభాగమైన భద్రతామండలి పరిధి మరింత విస్తృతమవుతున్న తరుణంలో… భారత్ కు భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం ఉండాల్సిందేనని ఫ్రాన్స్ డిమాండ్ చేసింది.
ఇండియాతో పాటు జర్మనీ, బ్రెజిల్, జపాన్ లకు కూడా శాశ్వత సభ్యత్వాన్ని కల్పించాలని తెలిపింది. భద్రతామండలిని విస్తరించే క్రమంలో మరిన్ని కీలక దేశాలు శాశ్వత సభ్యులుగా ఉండాలనేది తమ వ్యూహాత్మక అంశమని చెప్పింది. అప్పుడే సమతుల్యం ఏర్పడుతుందని తెలిపింది.