telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘పాన్ ఇండియా’ ఇమేజ్ రేసులో అల్లు అర్జున్ స్పీడు

Aa

‘అల వైకుంఠపురములో ‘ మూవీ ఇండస్ట్రీ రికార్డు కొట్టడం తో అల్లు అర్జున్ ఎన్నడూ లేనంత హుషారుగా ఉన్నాడు. ‘నా పేరు సూర్య ‘ తర్వాత ఒక్క కథ ఎంపిక చేసుకునేందుకే ఏడాదికి పైగా సమయం తీసుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం ఒకేసారి రెండు సినిమాలను లైన్లో పెట్టడంతో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అల్లు అర్జున్ మిగతా హీరోల లైనప్ కంటే బెస్ట్ లైనప్ సెట్ చేసుకున్నాడు. మన హీరోలంతా ఇప్పుడు పాన్ ఇండియా ఇమేజ్ కోసం జపం చేస్తున్నారు గానీ 2004లో వచ్చిన ఆర్య అల్లు అర్జున్ కు తెలుగుతో పాటే మలయాళంలోనూ స్టార్డం తెచ్చింది. అక్కడి హీరోలకు ఏమాత్రం తగ్గకుండా అల్లు అర్జున్ సినిమాలకు కలెక్షన్లు వస్తుంటాయి. అయితే ఆ తర్వాత అల్లు అర్జున్ పాన్ ఇండియా ఇమేజ్ కోసం అంత సీరియస్ గా పట్టించుకోలేదు. తమిళ్ లో లింగుస్వామితో ఓ సినిమా ప్లాన్ చేసినా అది ఆగిపోయింది. ఇక బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ పెరగడం, ఆయన ఇక వరుసబెట్టి పాన్ ఇండియా సినిమాలకే పరిమితమవడం, ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా రాజమౌళితో ‘ఆర్ఆర్ఆర్ ‘ చేస్తుండటం, మహేష్ తర్వాతి మూవీ రాజమౌళితో ఉండటంతో రేస్ లో తను వెనక పడకూడదని అల్లు అర్జున్ గట్టిగానే నిర్ణయించుకున్నట్లున్నాడు. తనకు ఎలాగూ ఇప్పట్లో రాజమౌళి దొరికే ఛాన్స్ లేదు కాబట్టి తెలుగులో ఉన్న మిగతా టాప్ డైరెక్టర్లందరినీ తన లైన్లోకే తెచ్చుకున్నాడు. ఇప్పటికే సుకుమార్ తో ఐదు భాషల్లో ‘పుష్ప’ మూవీ మొదలు పెట్టగా, ఆ వెంటనే కొరటాల శివతో తన 21వ సినిమాని అనౌన్స్ చేశాడు. కొరటాల అంటేనే భారీ చిత్రాలకు పేరు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యేలోగా త్రివిక్రమ్ తో మరో సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటి యంగ్ అగ్ర హీరోల్లో ఏ హీరోకు లేని లైనప్ ప్రస్తుతం అల్లు అర్జున్ కి ఉంది. దీనిని బట్టి అల్లు అర్జున్ పాన్ ఇండియా ఇమేజ్ కోసం ఎంత కృషి చేస్తున్నాడో అర్థమవుతుంది.

Related posts