telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కరణ్ జోహార్ పాట పాడితే తలనొప్పే… వీడియో వైరల్

Karan

కరోనా లాక్‌డౌన్‌ టైంలో ఫిలిమ్‌ మేకర్‌ కరణ్‌ జోహార్‌ తన పిల్లలు యశ్‌, రూహిలతో కలిసి… పలు వీడియోలు, ఫోటోలు రూపొందిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా తన ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్‌ చేశాడు. రూహీ, యశ్‌లు పాత హిందీ పాటలను వింటూ ఆస్వాదిస్తుండగా కరణ్‌ వచ్చి పాట పాడటం ప్రారంభించాడు. దీంతో రూహీ వెంటనే ‘నువ్వు పాట పాడితే నాకు తల నొప్పి వస్తుంది’ అనడంతో మరో పాట అందుకున్నాడు కరణ్‌. అయితే ఈసారి యశ్‌ కూడా ‘నాన్న నువ్వు పాట పాడితే మాకు తలనొప్పిగా ఉంది’ అని అనడంతో కరణ్‌ పాట పాడటం ఆపేశాడు. ఎంతో క్యూట్‌, ఫన్నీగా ఉన్న ఈ వీడియో కేవలం గంట వ్యవధిలోనే మూడు లక్షలకుపైగా మంది వీక్షించగా వేల మంది లైక్‌ చేశారు. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

 

View this post on Instagram

 

No appreciation for my singing #lockdownwiththejohars

A post shared by Karan Johar (@karanjohar) on

Related posts