టీఆర్ఎస్ ప్రభుత్వం పై పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ తీవ్ర విమర్శలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని అన్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ సమస్యలు పరిష్కరించకుండా సినీ నటులతో విదేశాలలో తిరుగుతున్నారని మాజీ ఆరోపించారు.
హైదరాబాద్లో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్వహణను కేటీఆర్ మిత్రుడి కంపెనీకి ఇచ్చారని ఆరోపించారు. అయినప్పటికీ వారు పట్టించుకోవట్లేదని విమర్శించారు. బంగారు తెలంగాణ అనుకున్నాం కానీ.. తండ్రీ కొడుకులు శూన్య తెలంగాణ చేస్తున్నారని దుయ్యబట్టారు. కాళేశ్వరం బిల్లుల మీద ఉన్న శ్రద్ధ పాలనపై లేదని వివేక్ విమర్శించారు.