telugu navyamedia
క్రీడలు వార్తలు

సిరాజ్ ఖాతాలో మొదటి వికెట్…

భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ 6 వ వికెట్ కోల్పోయింది. అయితే ఈ రోజు తమ మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ పతనానికి మ్యాచ్ మొదటి ఓవర్లోనే వికెట్ తీసి ఇశాంత్ శర్మ దారి వేసాడు. ఆ తర్వాత అశ్విన్ ఇప్పటివరకు వుత్తం మూడు వికెట్లు సాధించగా ఈ మ్యాచ్ తోనే అంతర్జాతీయ టెస్ట్ లోకి అరంగేట్రం చేసిన అక్షర్ రూట్ రూపంలో పెద్ద వికెట్ ను తీసాడు. అయితే మొదటి సేసగం పూర్తి కావడానికి ముందు 4 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ రెండో సెషన్ ఆరంభంలోనే స్టోక్స్ రూపంలో 5 వికెట్ ను చేజార్చుకోగా ఇప్పుడు ఓలీ పోప్(22) ఔట్ కావడంతో 87 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. అయితే ఈ మ్యాచ్ లో బౌలర్ సిరాజ్ తాను వేస్తున్న మోడజాతి ఓవర్ మొదటి బంతికే ఈ వికెట్ తీసి తన ఖాతాలో వేసుకున్నాడు. దాంతో మరింత కష్టాలో కూరుకుపోయింది ఇంగ్లాండ్. అయితే భారత్ ఇంకా ఇంగ్లాండ్ కంటే 224 పరుగుల ఆధిక్యంలో ఉంది. అయితే ఈరోజు ఆట ముగియడానికి ఇంకా 40 ఓవర్లు ఉండటంతో భారత బౌలర్లు ఈరోజే ఇంగ్లాండ్ ను ఆల్ ఔట్ చేసేలా కనిపిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts