ఏపీలో రెండో విడత పంచాయితీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న వైసీపీ మద్దతు దారులు ఘనవిజయం సాధించారు. తొలివిడతలో అత్యధిక గ్రామ పంచాయితీలు సొంతం చేసుకున్న వైసీపీ, రెండోవిడతలోనూ అదే జోరును కొనసాగించింది. ఇక టీడీపీ కి కంచుకోటగా ఉన్న ప్రాంతాల్లోనూ వైసీపీ విజయం సాధించింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి దత్తత తీసుకున్న గ్రామంలో వైసీపీ మద్దతుదారులు విజయం సాధించారు. కృష్ణా జిల్లాలోని పామర్రు మండలంలోని కొమరవోలు గ్రామాన్ని చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి దత్తత తీసుకున్నారు. భువనేశ్వరి తల్లి బసవతారకం సొంతగ్రామం కావడంతో ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అయితే, ఆ గ్రామంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి రత్నకుమారి 107 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే టీడీపీ కూడా వైసీపీకి కొన్ని చోట్ల షాక్ ఇచ్చింది. వైసీపీ మంత్రుల సొంత ఊర్లలో టీడీపీ మద్దతు ఇచ్చిన అధ్యార్దులు విజయం సాధించారు.
previous post
next post