వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటికి ఆహ్వానం అందింది. కరోనా సమయంలో పరిశ్రమలకు సంబంధించిన కార్యక్రమాలపై వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రశంసలు కురిపించింది. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కృషిని డబ్ల్యూఎఫ్ అధ్యక్షులు బోర్గ్ బ్రండే అభినందించారు. ఈ ఏడాది ఏప్రిల్ 5-7 తేదీల మధ్య జపాన్ రాజధాని టోక్యో నగరంలో జరుగనున్న సదస్సుకు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హాజరుకానున్నారు. కోవిడ్-19 సంక్షోభం తర్వాత దేశాలు అభివృద్ధి బాటలో సాగేందుకు ‘ఎమర్జింగ్ టెక్నాలజీల వినియోగం’ అనే అంశంపై దృష్టి సారించనుంది సదస్సు. ఈ సదస్సుకు వివిధ దేశాల ప్రభుత్వాధినేతలు, రాష్ట్రాల మంత్రులు, వ్యాపార, వాణిజ్య రంగాల ప్రముఖులు హాజరు కానున్నారు.
previous post