telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

పెన్షనర్ల వేతనాల కోతపై హైకోర్టు లో విచారణ

high court on new building in telangana

పెన్షనర్ల వేతనాల కోతపై తెలంగాణ హైకోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. పింఛన్‌పైనే ఆధారపడి జీవించే విశ్రాంత ఉద్యోగుల పట్ల ప్రభుత్వం కాస్త దయతో వ్యవహరించాల్సి ఉందని తెలిపింది. అలాంటి వారి పింఛన్లలో కోత విధిస్తూ ఏ ప్రాతిపదికన నిర్ణయించారని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

కరోనా కష్టకాలమంటూ విశ్రాంత ఉద్యోగుల పింఛన్లలో యాభై శాతం కోత విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను కోర్టు ఈ రోజు విచారించింది. ప్రభుత్వ నిర్ణయం సరైనది కాదని, లాక్‌డౌన్‌ కాలంలో విశ్రాంత ఉద్యోగులకు సమస్యలు వస్తే ఎవరు ఆదుకుంటారని ప్రశ్నించింది. అందువల్ల పూర్తి పెన్షన్‌ ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఒప్పించండని అడ్వకేట్‌ జనరల్‌కు కోర్టు సూచించింది. తదుపరి విచారణను ఈనెల 24వ తేదీకి కోర్ట్ వాయిదా వేసింది.

Related posts