ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డితో దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత భేటీ అయ్యారు. బుధవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని జగన్ నివాసంలో కలిశారు. సుమారు అరగంటపాటు వీరిద్దరి మధ్య పలు విషయాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా వివేకానందరెడ్డి హత్య కేసు పురోగతిపై చర్చించారని సమాచారం. అదే విధంగా ఈ కేసును మళ్లీ మొదట్నుంచి దర్యాప్తు చేయించాలని కూడా సీఎంను సునీత కోరినట్లు తెలుస్తోంది. సీఎం జగన్తో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ అయిన తర్వాత సునీత భేటీ కావడం చర్చనీయాంశమైంది.