telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

కుంబ్లే తో సమానంగా బుమ్రా..

భారత్ ఆసీస్ పర్యటనలో భాగంగా ప్రస్తుతం నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో తలపడుతుంది. అందులో భాంగంగా మెల్‌బోర్న్ వేదికగా ఆసీస్ తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ తో బుమ్రా అరుదైన ఘనత అందుకున్నాడు. అయితే మెల్‌బోర్న్ గ్రౌండ్ లో ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేస్తే వారి పేర్లను అక్కడ ఉన్న బోర్డు పైకి ఎక్కిస్తారు. అలా చివరిసారి భారత్ అక్కడ మ్యాచ్ ఆడినప్పుడు బుమ్రా ఒక్క ఇన్నింగ్స్ లో 6 వికెట్లు సాధించాడు. ఆ మ్యాచ్ లో మొత్తం 9 వికెట్లు తీసాడు. అయితే ఇప్పుడు తాజాగా జరిగిన మ్యాచ్ లో బుమ్రా మొత్తం 6 వికెట్లు తీయడంతో మొత్తం 15 వికెట్లను తన ఖాతాలో వేసుకొని భారత స్టార్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే సరసన నిలిచాడు. కుంబ్లే కూడా మెల్‌బోర్న్ స్టేడియంలో మొత్తం 15 వికెట్లు తీసాడు. అయితే ఈ తాజాగా జరిగిన మ్యాచ్ లో ఆసీస్ రెండు ఇన్నింగ్సుల్లో 195, 200 పరుగులు చేయగా భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 326 పరుగులు చేసింది. దాంతో భారత్ కు రెండో ఇన్నింగ్స్ లో విజయానికి 70 పరుగులు అవసరం కాగా 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. చూడాలి మరి తర్వాతి మ్యాచ్ లో విజయం ఎవరిది అనేది.

Related posts