telugu navyamedia
రాజకీయ వార్తలు

ఉగ్రవాదులంతా తమ హీరోలు..ముషారఫ్‌ సంచలన వ్యాఖ్యలు

musharraf again into politics soon

పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన ఓ వీడియో క్లిఫ్‌ బయటపడింది. ఉగ్రవాదులంతా తమ హీరోలని ముషారఫ్‌ వ్యాఖ్యానించారు. ఒసామా బిన్‌ లాడెన్‌, జవహిరీ, జలాలుద్దీన్‌ హక్కానీ పాకిస్థాన్‌ హీరోలు అని ముషారఫ్‌ పేర్కొన్నారు.

అంతే కాదు కశ్మీరీలకు పాకిస్థాన్‌లో శిక్షణ ఇచ్చి ఉగ్రవాదం వైపు మళ్లించామని ఆ ఇంటర్వ్యూలో ముషారఫ్‌ చెప్పారు. అయితే ఆ వీడియో క్లిఫ్‌ను పాకిస్థాన్‌ రాజకీయ నాయకులు ఫర్హాతుల్లా బాబర్‌ అనే వ్యక్తి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఆ ఇంటర్వ్యూ ఎప్పుడు జరిగిందో మాత్రం తెలియదు.

ఆ ఇంటర్వ్యూలో ముషారఫ్‌ మాట్లాడుతూ కశ్మీరీలు పాకిస్థాన్‌ వచ్చేవారు. వారికి ఉగ్రవాదంలో శిక్షణ ఇచ్చి మద్దతు తెలిపాం. వారిని ముజాహిద్దీన్‌ ఉగ్రవాదులుగా మార్చి ఇండియన్‌ ఆర్మీపై ఫైట్‌ చేయాలని చెప్పాం. ఆ తర్వాత లష్కరే తోయిబా లాంటి ఉగ్రవాద సంస్థలు పుట్టుకొచ్చాయి. 1979 కాలంలో పాకిస్థాన్‌ ప్రయోజనాల కోసం ఆప్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి.. ప్రపంచం నలు మూలల నుంచి ముజాహిద్దీన్‌లను తీసుకువచ్చాం. వారికి శిక్షణ ఇచ్చి ఆయుధాలను కూడా సరఫరా చేశామని పేర్కొన్నారు.

Related posts