ఒకట్రెండు ఏళ్లు కష్టపడ్డా తర్వాత పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో ముందుకెళతారని ఏపీ సీఎం జగన్ అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఒంగోలులో ‘మనబడి నాడు నేడు’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. పేదరికం నుంచి బయట పడాలంటే చదువు ఒక్కటే మార్గమని అన్నారు. ఇంగ్లిష్ మీడియం పెడితే కొన్ని సమస్యలు వస్తాయని తెలుసు. వాటిని అధిగమించేందుకు బ్రిడ్జ్ కోర్సులు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వ నిర్ణయాలపై ఆరోపణలు చేసేవారు హిపోక్రసీని వదలి డెమొక్రసీకి విలువ ఇవ్వాలి. ప్రతి ఏడాది పాఠశాలలకు రూ.3500 కోట్లు ఖర్చు చేస్తాం. 45 వేల పాఠశాలల రూపు రేఖలను మార్చుతాం. పాఠశాలల్లో అన్ని వసతులు తీసుకొస్తాం. ఉన్నత చదువులు చదువుతోన్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంటు పథకాన్ని కూడా తీసుకొస్తున్నాం. హాస్టల్ లో ఉన్న విద్యార్థులకు ఖర్చుల కోసం ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని తెలిపారు.