telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

ఏపీలో కరోనా మరణమృదంగం..24 గంటల్లో 93 మంది మృతి

Corona

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ మరణాల సంఖ్య పెరిగిపోతోంది. గడచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 93 మంది మరణించారు. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 16 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 13 మంది, చిత్తూరు జిల్లాలో 11 మంది, కర్నూలు జిల్లాలో 10 మంది మృతి చెందారు. ఈ క్రమంలో మొత్తం మరణాల సంఖ్య 3,282కు చేరింది.

కోవిడ్ విజృంభణతో రాష్ట్రంలో కొత్తగా 7,895 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 1,256 కేసులు గుర్తించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,53,111కి చేరింది. ఇప్పటివరకు 2,60,087 మంది కోలుకున్నారు.

Related posts