telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

‘నేతన్న నేస్తం’ అందరికీ అమలు చేయాలి: నారా లోకేశ్

Nara Lokesh

ప్రతి నేత కార్మికునికి ‘నేతన్న నేస్తం’ కింద రూ.24 వేలు ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీ సీఎం జగన్ కు లోకేశ్ లేఖ రాశారు. కరోనా సంక్షోభ సమయంలో కుదేలైన చేనేత రంగాన్ని ఆదుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లను ఆయన సీఎం ముందుంచారు.

సొంత మగ్గం ఉన్నవారికే పథకం అంటూ నిబంధనల పేరుతో కోత విధించకుండా నేతన్న నేస్తం’ అందరికీ అమలు చేయాలని తెలిపారు. సొంత మగ్గం ఏర్పాటు చేసుకోవాలనుకునే ప్రతి నేతన్నకు రూ.1.5 లక్షల సబ్సిడీ రుణాన్ని ప్రభుత్వం అందించాలని సూచించారు. కరోనా సంక్షోభ సమయంలో ప్రతి చేనేత కార్మిక కుటుంబానికి రూ.10 వేలు ఇవ్వాలని తెలిపారు. నేత కార్మికుల వద్ద ఉన్న స్టాక్ ను ప్రభుత్వం ఆప్కో ద్వారా కొనుగోలు చేసి వెంటనే చెల్లింపులు చేయాలని లోకేశ్ తన లేఖలో పేర్కొన్నారు.

Related posts