telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమరావతి జేఏసీ కార్యాలయం ప్రారంభం

amaravathi ap

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఉద్యమం నేటితో 250 రోజులకు చేరుకొంది. దేశ చరిత్రలో ఇంత సుదీర్ఘ ఉద్యమాలు అరుదుగా జరిగాయి. ఈ నేపథ్యంలో వెలగపూడిలో రాజధాని అమరావతి జేఏసీ కార్యాలయాన్ని రైతులు నేడు ఏర్పాటు చేశారు. రాజధాని ప్రాంతానికి చెందిన మహిళా రైతు కంభంపాటి శిరీష రిబ్బన్ కట్ చేసి జేఏసీ కార్యాలయాన్ని ప్రారంభించారు.

అనంతరం రైతులు, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీ నేతలు సంయుక్తంగా జేఏసీ జెండాను ఆవిష్కరించారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న రాజధాని వికేంద్రీకరణ నిర్ణయాన్ని అమరావతి ప్రాంత రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో తమ ఉద్యమాన్ని మరింత పటిష్టం చేసేందుకు జేఏసీ కార్యాలయాన్ని ప్రారంభించారు.

Related posts