telugu navyamedia
రాజకీయ వార్తలు

కశ్మీర్ లో హింసకు పాకిస్థానే కారణం: రాహుల్ గాంధీ

rahul gandhi fire on modi in campaign

పాకిస్థాన్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. జమ్మూ కశ్మీర్ లో జరిగే హిసాత్మక ఘటనలకు పాకిస్థానే కారణమని అన్నారు. కశ్మీర్ లో హింస చోటు చేసుకునేలా పాకిస్థాన్ ప్రేరేపిస్తోందని చెప్పారు. ఒక్క కశ్మీర్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా టెర్రరిస్టులకు పాక్ మద్దతు ఇస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు.

ఎన్నో విషయాలలో ప్రభుత్వంతో తాను ఏకీభవించలేనని రాహుల్ అన్నారు. ఒక్క విషయాన్ని మాత్రం తాను స్పష్టంగా చెప్పదలుచుకున్నానని, కశ్మీర్ భారత్ అంతర్గత వ్యవహారమని అన్నారు. కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోవడానికి పాకిస్థాన్ కే కాదు, ప్రపంచంలో మరే దేశానికి తావులేదని రాహుల్ వ్యాఖ్యానించారు.

Related posts