ఉత్తరాదిన గుర్తింపు తెచ్చుకున్న డ్యాన్సర్ సప్నా చౌదరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. యూపీ కాంగ్రెస్ చీఫ్ రాజ్ బబ్బార్ సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ విషయాన్ని యూపీ తూర్పు విభాగం బాధ్యతలు చూస్తున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ధ్రువీకరించారు. 2017లో హిందీ బిగ్ బాస్ రియాలిటీ షో-11లో సప్నా చౌదరి పాల్గొన్నారు. అంతకుముందు ఏడాది ఓ కార్యక్రమంలో దళితుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించారని ఆమెపై హరియాణాలో రెండు కేసులు నమోదు అయ్యాయి.
ఉత్తరాది రాష్ట్రాల్లో సప్నా చౌదరి డ్యాన్స్ షోలకు భారీ డిమాండ్ ఉంది. ఆమె డ్యాన్స్ చూసేందుకు భారీగా ప్రజలు తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో సప్నాను బీజేపీ నేత, నటి హేమమాలినిపై పోటీకి దించాలని కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. హేమమాలిని ప్రస్తుతం యూపీలోని మథుర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కాపులను బీసీల్లో చేరుస్తామని చంద్రబాబు మోసం: అంబటి