కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఇటీవల టీటీడీ రద్దు చేసిన విషయం తెలిసిందే. రద్దు చేసిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ తిరిగి అందుబాటులోకి తెచ్చింది. దీంతో భక్తులు ముందుగా దర్శన టికెట్లను బుక్ చేసుకొని శ్రీవారిని దర్శించుకోనున్నారు. భక్తుల సౌకర్యార్థం 2020 సెప్టెంబరు నెల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఆగస్టు 24వ తేదీన ఉదయం 11.00 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.
సెప్టెంబరు 15న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వారు తిరుమంజనం, సెప్టెంబరు 18 నుంచి 27వరకు శ్రీవారి నవాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనము టికెట్లను టీటీడీ రద్దు చేసింది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్లో ముందస్తుగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇప్పుడున్న అసెంబ్లీలో స్థలం సరిపోవడం లేదు: ఎమ్మెల్యే బాల్క సుమన్