telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

విజ్ఞనాయకుడి గురించి .. కొన్ని విషయాలు.. తెలుసుకోండి మరి..

few thing need to know about Ganesha

ఏ పని సజావుగా సాగాలన్నా దానికి అడ్డంకులు ఉండకూడదు, అందుకే ముందుగా విఘ్నాలను తొలగించే వినాయకుణ్ణి పూజిస్తాం. ఆలా పూజిస్తే చేసే పనిలో ఎటువంటి ఆటంకాలు రావని నమ్మకం. వినాయకచవితి పండుగ ని దేశమంతా, కుల మతాలకి అతీతంగా భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం భద్రపదమాసంలో చవితి రోజు ఈ పండుగ వస్తుంది. వినాయకచవితి రోజు పూజ చేసుకుంటే సంవత్సరం అంతా ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆనందంగా ఉంటారని నమ్మకం. ఆది దేవుడిగా అభివర్ణించి వినాయకుడి పూజ తరువాతే మనం ఈ పని అయిన ప్రారంభిస్తాం . లేకుంటే ఆ పని సక్రమంగా పూర్తికాదని, మన కోరిక నెరవేరదని నమ్ముతాం. వినాయకునికి నమస్కరించినట్లయితే ఎలాంటి ఆటంకాలూ ఎదురవకుండా పనులు జరుగుతాయి. అందుకే గణేశుని విఘ్నాధిపతి అంటారు. ఎలాంటి శుభ కార్యక్రమాలు ప్రారంభించిన ముందుగా వినాయకుడి పూజతోనే ప్రారంభిస్తారు .

ఇతర దేవుళ్ళను ఆరాధించేవారు కూడా వినాయకుని విగ్రహాన్ని తమ పూజా మందిరంలో తప్పకుండా పెట్టుకుంటారు . అందరూ ఇంత భక్తిశ్రద్ధలతో పూజించే వినాయకుడికి ఒక దంతం సగం వరకు విరిగి ఉంటుంది. ఎందువల్ల ఆ దంతం విరిగింది. అసలు వినాయకుడిని విఘ్నాధిపతి అని ఎందుకు పిలుస్తారో తెలుసుకుందాం. వినాయకుడి దంతం విరిగి ఉండటానికి, విఘ్నాధిపతిగా మొదట పూజించడానికి సంబంధించి ఒక పురాణ కధనం ఉంది. షణ్ముఖుడు స్త్రీ పురుష లక్షణాలను చాటిచెప్పే గ్రంధం ప్రారంభించాడట. అందులో ప్రస్తావించిన పురుష లక్షణాలు ఏవీ తనలో లేవు అనిపించిందట గణపయ్యకి. దాంతో కోపమొచ్చి ఆ గ్రంధం పూర్తవకుండా విఘ్నం కలిగించాడట. షణ్ముఖుడేం సామాన్యుడా… కోపోద్రిక్తుడై గణపతి దంతాన్ని విరగొట్టాడని పురాణాలు చెప్తున్నాయి. గణపయ్య దంతం సగమే ఉండటానికి కారణం షణ్ముఖుడన్నమాట. మొత్తానికి అప్పటినుంచీ ఎదైనా పని మొదలుపెట్టేముందు, అది మధ్యలో ఆగిపోకుండా గణపయ్యను ప్రసన్నం చేసుకోవడం ఆనవాయితీగా మారింది.

Related posts