telugu navyamedia
రాజకీయ వార్తలు

మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో కన్నుమూత

Nandi Ellaiah Mp

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య(78) కరోనాతో కన్నుమూశారు. హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. గత నెల 29వ తేదీన కరోనా లక్షణాలతో ఆయన ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం ప్రకటించారు.

ఆరు సార్లు లోక్ సభకు, రెండు సార్లు రాజ్యసభకు ఆయన ప్రాతినిథ్యం వహించారు. ఓటమి ఎరుగని నేతగా నంది ఎల్లయ్యకు గుర్తింపు ఉంది. సిద్దిపేట పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆయన 6వ, 7వ, 9వ, 10వ, 11వ లోక్ సభకు ఎన్నికయ్యారు. 16వ లోక్ సభకు నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2014 వరకు రాజ్యసభకు ప్రతినిథ్యం వహించారు. 2014లో తెలంగాణ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

Related posts