telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

ఏపీలో కరోనా కన్నెర్ర .. ఒక్కరోజే 52 మంది మృతి

Corona

ఏపీలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో ఏపీలో 52 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 12 మంది చనిపోగా, గుంటూరు జిల్లాలో 8 మంది, కృష్ణా జిల్లాలో 8 మంది, అనంతపురం జిల్లాలో ఏడుగురు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఐదుగురు, ప్రకాశం జిల్లాలో నలుగురు, నెల్లూరు జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు, చిత్తూరు జిల్లాలో ఒకరు, కడప జిల్లాలో ఒకరు, విజయనగరం జిల్లాలో ఒకరు మరణించారు. దాంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 586కి పెరిగింది.

రాష్ట్రంలో కొత్తగా 3,963 మందికి పాజిటివ్ అని తేలింది. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 994 మందికి పాజిటివ్ వచ్చింది. కర్నూలు జిల్లాలో 550, పశ్చిమ గోదావరి జిల్లాలో 407 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 44,609కి చేరింది. తాజాగా 1,411 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 22,260 మంది చికిత్స పొందుతున్నారు.

Related posts