telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఈనాడు కథనం పై ఏపీ మంత్రి ఫైర్!

minister anil kumar

“పోలవరం” పై ‘అస్మదీయులకు అప్పగించేందుకేనా? అంటూ ఈనాడు దిన పత్రికలో వచ్చిన కథనం పై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఆ పత్రిక యాజమాన్యం తెరవెనుక ఉద్దేశాలను బయటపెట్టిందని విమర్శించారు. రివర్స్ టెండరింగ్ తర్వాత ఆ కాంట్రాక్టు ఎవరికి దక్కుతుందో తెలియకపోయినా అస్మదీయుల కోసమే అంటూ రామోజీరావు పత్రిక కథనం వండి వార్చిందని విమర్శించారు.

పోలవరం నిర్మాణం నుంచి వైదొలగిన నవయుగ కంపెనీకి, రామోజీరావు కుటుంబంతో ఉన్న బంధం, బంధుత్వం ఈ అసత్య కథనం రాయడానికి ప్రేరేపించిందని ఆరోపించారు. ఈ విషయం ఈనాడు పాఠకులకు తెలియాలన్న ఉద్దేశంతోనే సంబంధిత మంత్రిగా వివరణ ఇస్తున్నానని అన్నారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టులో వందల కోట్లు చేతులు మారాయని ఈనాడు పత్రిక ఏనాడూ ఒక కథనం కూడా రాయలేదని, దీని వెనుక ఏ ప్రజల ప్రయోజనాలు ఉన్నాయని ప్రశ్నించారు.

Related posts