“పోలవరం” పై ‘అస్మదీయులకు అప్పగించేందుకేనా? అంటూ ఈనాడు దిన పత్రికలో వచ్చిన కథనం పై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఆ పత్రిక యాజమాన్యం తెరవెనుక ఉద్దేశాలను బయటపెట్టిందని విమర్శించారు. రివర్స్ టెండరింగ్ తర్వాత ఆ కాంట్రాక్టు ఎవరికి దక్కుతుందో తెలియకపోయినా అస్మదీయుల కోసమే అంటూ రామోజీరావు పత్రిక కథనం వండి వార్చిందని విమర్శించారు.
పోలవరం నిర్మాణం నుంచి వైదొలగిన నవయుగ కంపెనీకి, రామోజీరావు కుటుంబంతో ఉన్న బంధం, బంధుత్వం ఈ అసత్య కథనం రాయడానికి ప్రేరేపించిందని ఆరోపించారు. ఈ విషయం ఈనాడు పాఠకులకు తెలియాలన్న ఉద్దేశంతోనే సంబంధిత మంత్రిగా వివరణ ఇస్తున్నానని అన్నారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టులో వందల కోట్లు చేతులు మారాయని ఈనాడు పత్రిక ఏనాడూ ఒక కథనం కూడా రాయలేదని, దీని వెనుక ఏ ప్రజల ప్రయోజనాలు ఉన్నాయని ప్రశ్నించారు.
చీరలకు సిరిసిల్ల బ్రాండ్ అంబాసిడర్ కావాలి: కేటీఆర్