telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

విరాట్ బర్త్ డే… శుభాకాంక్షలు తెలిపిన క్రికెటర్లు…

భారత కెప్టెన్, రన్ మిషన్ కింగ్ కోహ్లీ ఈ రోజు తన 32వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. అతడికి అందరూ వారివారి శుభాకాంక్షలతో అతడికి ట్వీట్స్ చేస్తున్నారు. అయితే కోహ్లే 2008లో వన్డేలతో భారత క్రికెట్ జట్టులోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటికి విరాట్ తన కెరీర్‌లో మొత్తం 248 వన్డేలు ఆడాడు. దానికి తోడు 86 టెస్టులలో ఆడిన కోహ్లీ 7240పరుగులు చేశాడు. అదేవిధంగా 82 టీ20 మ్యాచుల్లో 2794 పరుగులు నమోదు చేశాడు. అయితే కోహ్లీ పుట్టిన రోజు సందర్భంగా భారత మాజీ ఆటగాడు సురేష రైనా తన అభినందనలు తెలిపాడు. వీవీఎస్ లక్ష్మణ్ కూడా తనదైన తీరులో విరాట్‌ను విష్ చేశాడు. వీరితో పాటుగా బీసీసీఐ కూడా కోహ్లీ బర్త్‌డే పై ఓ ట్వీట్ చేసింది. నీకు అన్ని ఆనందాలు, ప్రేమల దక్కాలి అంటూ తన ట్వీట్‌ను పూర్తిచేసింది. వాటితో పాటు కోహ్లీ రికార్డును గుర్తుచేస్తూ 2011 ప్రపంచకప్ విజేత, 70 శతకాలు, 21,901 పరుగులు, దానికి తోడుగో అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లు గెలిచిన భారత కెప్టెన్ అంటూ పొగిడింది. వీరితో పాటుగా సాహా కూడా నీతో గడిపిన సమయం ఎంతో అద్భుతంగా ఉందని అన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్-2020లో బెంగళూరు జట్టుకు న్యాయకత్వం వహిస్తున్నాడు.

Related posts