ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయోపరిమితి తగిస్తున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలు సీఎం కార్యాలయాన్ని సంప్రదించారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించింది. ఉద్యోగుల పదవీవిరమణ వయోపరిమితిని మార్చడంలేదంటూ ప్రభుత్వం స్పష్టం చేసింది.
వయోపరిమితి అంశంలో ఎలాంటి చర్యలు ఉండబోవని వివరించింది. దీనిపై అసత్య ప్రచారం చేస్తే చర్యలు ఉంటాయని సీఎంవో హెచ్చరించింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో రాష్ట్ర ఆర్థికస్థితిని దృష్టిలో ఉంచుకుని వయోపరిమితిపై కసరత్తు జరుగుతోందంటూ వార్తలు రావడంతో ప్రభుత్వం వివరణ ఇచ్చింది.