telugu navyamedia
వార్తలు సామాజిక

కోలుకున్న వారికి మళ్లీ కరోనా!

corona vairus

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు ఆటలకుతలమవుతున్న సంగతి తెలిసిందే. రోజురోజుకూ కేసులు భారీ సంఖ్యలో పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా బారిన పడి కోలుకున్న వారు మళ్లీ వైరస్ బారిన పడిన ఘటనలు బహిర్గతం కాలేదు.దీంతో, కరోనా ఒకసారి వస్తే మళ్లీ వచ్చే అవకాశం లేదనే వార్తలు కూడా వచ్చాయి.

చైనాలో తాజాగా జరిగిన పరిణామం అందరినీ ఆందోళనలోకి నెట్టివేసేదే. కొన్ని నెలక్రితం కరోనా నుంచి కోలుకున్న ఇద్దరు వ్యక్తులు తిరిగి వైరస్ బారిన పడ్డారు. చైనాలోని సెంట్రల్ ప్రావిన్స్ అయిన హుబేలో 68 ఏళ్ల మహిళకు గత డిసెంబర్ లో కరోనా సోకింది. గత ఆదివారం నాడు ఆమెకు మళ్లీ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మరో వ్యక్తి ఏప్రిల్ లో కరోనా బారిన పడ్డాడు. విదేశాల్లో ఉంటున్న ఆయన ఇటీవలే షాంఘై వచ్చాడు. సోమవారం ఆయనకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది.

Related posts