telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌లో .. మార్పులు చేసిన ఎపిపిఎస్సీ …

appsc

ఎపిపిఎస్సీ డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, టౌన్‌ప్లానింగ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నిర్వహించే మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసింది. ఈ మేరకు ఎపిపిఎస్సీ కార్యదర్శి ఎకె మౌర్య ప్రకటన విడుదల చేశారు. పాత షెడ్యూల్‌ ప్రకారం డిగ్రీ కాలేజీ లెక్చరర్ల పోస్టుల మెయిన్‌ పరీక్ష నవంబర్‌ 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహించాల్సి ఉండగా, ప్రస్తుతం నవంబర్‌ 29, 30వ తేదీలలో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు.

నవంబర్‌ 6, 8వ తేదీల్లో టౌన్‌ ప్లానింగ్‌ అసిస్టెంట్‌ మెయిన్‌ పరీక్ష షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించాల్సి ఉండగా, నవంబర్‌ 6, 7వ తేదీల్లో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. నవంబర్‌ 6న ఉదయం పేపర్‌-1, మధ్యాహ్నం పేపర్‌- 2 పరీక్షలను నిర్వహిస్తారు. పేపర్‌-3 పరీక్షను నవంబర్‌ 7న మధ్యాహ్నం నిర్వహించనున్నారు.

Related posts