ఈఎస్ఐ ఆస్పత్రిలోని ఐసోలేషన్ కేంద్రాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పరిశీలించారు. అనంతరం రోగులతో ఆయన మాట్లాడారు. దేశంలోనే అత్యుత్తమ ఆస్పత్రిగా హైద్రాబాద్ సనత్నగర్ ఈఎస్ఐకి పేరుందన్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల కంటే దీటుగా ఈఎస్ఐ ఆస్పత్రులను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని అన్నారు.
ప్రపంచ దేశాలు సైతం కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్నాయని కిషన్రెడ్డి తెలిపారు. వ్యాక్సిన్ కోసం ప్రధాని కార్యాలయం స్వయంగా మానిటరింగ్ చేస్తోందని ఆయన అన్నారు. కేంద్రం నుంచి ఎలాంటి సాయం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నామని కిషన్రెడ్డి స్పష్టం చేశారు.
కోట్లాది మంది ఆంధ్రుల్లో తానూ ఒకడిని: కేవీపీ