telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

ప్రకాశం జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్సు రైలు

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో గత అర్ధరాత్రి గూడ్సు రైలు పట్టాలుతప్పింది. విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న గూడ్సు రైలు నాయుడుపాలెం-బాపూజీనగర్ మధ్య సూరారెడ్డి పాలెం వద్ద వంతెన దాటుతుండగా ట్రాక్ కుంగిపోయి చివరన ఉన్న బోగీలు విడిపోయాయి. ఆ వెంటనే అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి.

ఈ ఘటనలో పట్టాలు తప్పిన బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అలాగే, 200 మీటర్ల మేర ట్రాక్ ధ్వంసమైంది. ప్రమాదంలో రూ. 80 లక్షల నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ట్రాక్ కుంగిపోవడం వల్లే ప్రమాదం సంభవించినట్టు అధికారులు తెలిపారు.

Related posts