చంద్రబాబు, లోకేష్ లపై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. “టీవీల్లో కనిపించే సామూహిక శవ దహనాలు, ఆక్సిజన్ లేక సొమ్మసిల్లిన రోగుల దృశ్యాలు మన రాష్ట్రంలోనివి కావని ఆ తండ్రీకొడుకులు బాగా తెలుసు. ఇంకో రాష్ట్రాన్ని వేలెత్తి చూపే ధైర్యం లేక ప్రతిదీ జగన్ గారి ప్రభుత్వ వైఫల్యంగా చిత్రించి ఉన్మాదుల్లా ఆనందిస్తున్నారు. ప్రజల రక్షణే తక్షణ బాధ్యతగా భావించింది ఏపీ ప్రభుత్వం. పేదలను ఆదుకునేందుకు ఉచిత బియ్యం కేంద్ర కోటాను రెట్టింపుచేసి ఇస్తోంది. పేదల ఆకలి తీర్చేందుకు 800 కోట్లు వెచ్చిస్తోంది రాష్ట్రం. కరోనా కష్టకాలంలో ఎవరూ ఆకలితో పస్తులు ఉండకూదన్నదే లక్ష్యం. ” విజయసాయిరెడ్డి వెల్లడించారు. మరో ట్వీట్ లో “అసలు లోకేశం నిజంగా చదువుకునే డిగ్రీ సంపాదించాడా? సత్యం బాబాయ్ తో డొనేషన్ కట్టించి సీటు కొనుక్కున్నట్లు…డిగ్రీలు కొనడానికి కూడా ఎవరైనా స్పాన్సర్ చేశారా? లేకపోతే అతని పేరుతో ఎవరైనా పరీక్షలు రాశారా? అతని IQ స్థాయి చూస్తే హైస్కూల్ దాటే ఛాన్సే లేదు.” అంటూ పేర్కొన్నారు.