telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శర్వానంద్ “శ్రీకారం” తిరుపతి షెడ్యూల్ పూర్తి

Srikaram

యంగ్ హీరో శర్వానంద్ రైతుపాత్రలో ‘శ్రీకారం’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కిషోర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమను 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతమందిస్తున్నాడు. శర్వా సరసన ప్రియాంకా అరుల్‌ మోహన్ హీరోయిన్ గా‌ నటిస్తోంది. అయితే ఇటీవలే చిత్ర యూనిట్ ఒక కీలక షెడ్యూల్ కు తిరుపతి వెళ్లిన సంగతి తెలిసిందే. 20 రోజుల పాటు ప్లాన్ చేసిన ఈ లాంగ్ షెడ్యూల్ ను వారు ఇపుడు పూర్తి చేసేసినట్టు తెలుస్తుంది. ఇద్దరు హీరో హీరోయిన్లు పాల్గొన్న ఈ లాంగ్ షెడ్యూల్ లో చాలా మంది నటీనటులు, టెక్నిషియన్స్ పాల్గొన్నారు. నిర్మాతలు రామ్ ఆచంట మరియు గోపి ఆచంటలు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ షెడ్యూల్ ను పూర్తి చేసేలా సహకరించినందుకు గాను చిత్రయూనిట్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Related posts