telugu navyamedia
రాజకీయ వార్తలు

నాలుగోసారి మధ్యప్రదేశ్ సీఎంగా చౌహాన్!

Shivraj-Singh-Chouhan

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ నాలుగోసారి బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీనీ వీడిన తర్వాత ఆయనతో పాటు ఆయన వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.

దీంతో, కమల్ నాథ్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గత గురువారం విశ్వాస పరీక్షను ఎదుర్కోకుండానే ముఖ్యమంత్రి పదవికి కమల్ నాథ్ రాజీనామా చేశారు. దీంతో మధ్యప్రదేశ్ లో బీజేపీ మరోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకొంటుంది.

Related posts