telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

టీటీడీ ఉద్యోగుల పాలిట శాపంగా మారిన కరోనా.. 15 మంది ఉద్యోగులు మృతి

ttd plans to venkanna temples in mumbai and j & K

ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 10 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 14,792 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 10,84,336 కు చేరింది. అటు టీటీడీ ఉద్యోగులను కూడా కరోనా వదలడం లేదు. రోజు రోజుకు తిరుమల కొండపై కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా కారణంగా 15 మంది టిటిడి ఉద్యోగులు మృతి చెందారని చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. తిరుమలలో విధులు నిర్వహిస్తునందు వలన వైరస్ సోకడం లేదని.. టిటిడి ఉద్యోగులు అందరికి యుద్ద ప్రాతిపాదికన వ్యాక్సినేషన్ చేయిస్తామని తెలిపారు. ఉద్యోగులు తిరుపతిలో నివసిస్తుండటం కారణంగా వైరస్ వ్యాపిస్తోందని పేర్కొన్నారు. బర్డ్ హస్పిటల్స్ లో ఉద్యోగులుకు ప్రత్యేకంగా కోవిడ్ చికిత్స అందిస్తామని..గోవు ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన బియ్యంతో స్వామివారికి నైవేద్యం సమర్పణ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఏడాది లోపు మూడు దశలలో నైవేధ్య సమర్పణ, భక్తులుకు ప్రసాదాల పంపిణి, అన్నప్రసాద సముదాయంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన బియ్యాన్ని వినియోగిస్తామని పేర్కొన్నారు. దర్శనాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని..స్వామివారి దర్శనానికి విచ్చేసే భక్తులును నిర్బంధంగా ఆపలేమన్నారు. 

Related posts