విశాఖ జిల్లాలోని అరకు ఘాట్ రోడ్డు ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అరకు ఘాట్ రోడ్డులో పర్యాటకుల బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా, పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. అయితే…ఈ ఘటన మరువక ముందే..మహారాష్ట్రలో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో జరిగిన ట్రక్కు ప్రమాదంలో 15 మంది అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. యావల్ తాలుకాలోని కింగ్వాన్ వద్ద బొప్పాయి లోడ్ తీసుకెళుతున్న ట్రక్కు బోల్తాపడటంతో ఈ ప్రమాదం జరిగింది. అందులో ప్రయాణిస్తు్న వారిలో 15 మంది అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు… ఘటనా స్థలానికి చేరుకుని… సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
previous post
next post
నాయకుల స్వార్థంతో రాజధాని మార్చాలని నిర్ణయం: యనమల