telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఏపీలో కరోనా పంజా.. ఒకే కాలేజీలో 140 మందికి పాజిటివ్!

ఏపీలోని విద్యాసంస్థలోనూ కరోనా విలయం కొనసాగుతోంది. తాజాగా తూ. గో జిల్లా రాజమహేంద్రవరం పరిధిలోని ఒక కాలేజీ లో ఇప్పటి వరకు ఇప్పటి వరకు 163 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గత రెండు రోజులుగా ఆ కాలేజీ లో 10, 13 కేసులు నమోదు కాగా… నిన్న ఒక్కరోజే ఏకంగా 140 మందికి కరోనా సోకింది. పాజిటివ్ వచ్చిన వారిని.. క్వారయింటైన్ లో ఉంచి.. వారి కాంటాక్ట్ లిస్ట్ పరిశీలిస్తున్నారు అధికారులు. కాగా ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 8.93 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కరోనా బులిటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 368 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,93,734 కు చేరింది. ఇందులో 8,84,347 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,188 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 7,189 మంది మృతి చెందారు.

Related posts