telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఏఎన్ఆర్ నేష‌న‌ల్ అవార్డ్స్ కు ముఖ్య అతిథిగా చిరంజీవి

ANR

అక్కినేని ఫ్యామిలీ ప్ర‌తి ఏడాది ఏఎన్ఆర్ నేష‌న‌ల్ అవార్డ్స్ కార్య‌క్ర‌మాన్ని ఎంతో ఘ‌నంగా నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌తి సంవ‌త్స‌రం ఒక్కో సెల‌బ్రిటీని ఈ అవార్డ్‌కి ఎంపిక చేస్తూ వ‌స్తున్నారు. సినిమా రంగంలో ఎన‌లేని సేవ‌లు అందించిన ప్ర‌ముఖుల‌కు ఈ అవార్డును అక్కినేని ఇంట‌ర్నేష‌న‌ల్ ఫౌండేష‌న్ సంస్థ అందిస్తుంది. 2006 నుండి 2017 వ‌ర‌కు ఈ అవార్డుల‌ను ప్ర‌దానం చేశారు. అయితే 2017లో రాజ‌మౌళికి ఏఎన్ఆర్ అవార్డ్ దక్కింది. గురువారం 2018, 2019 సంవ‌త్స‌రాల‌కుగానూ ఈ అవార్డుల‌ను ప్ర‌క‌టించారు. 2018గానూ దివంగ‌త న‌టి శ్రీదేవికి ఈ అవార్డు ద‌క్కింది. శ్రీదేవి స్థానంలో ఆమె భ‌ర్త‌, ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్ ఈ అవార్డును అందుకోనున్నారు. 2019గానూ బాలీవుడ్ సీనియ‌ర్ న‌టి రేఖ‌కు ఈ అవార్డు ద‌క్కింది. ఈ అవార్డుల ప్ర‌దానోత్స‌వ కార్య‌క్ర‌మం న‌వంబ‌ర్ 17న అన్న‌పూర్ణ సెవెన్ ఏక‌ర్స్‌లో జ‌ర‌గ‌నుంది. ఈ కార్యక్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా, టి.సుబ్బరామిరెడ్డి ప్ర‌త్యేక అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ సంద‌ర్భంలో అన్న‌పూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా సంస్థ‌లో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసుకున్న విద్యార్థుల‌కు డిగ్రీల‌ను అంద చేయ‌నున్నారు.

Related posts