telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అనంతపురంలో అభ్యర్థులను ఖరారు చేసిన చంద్రబాబు!

Chandrababu comments Jagan cases

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 8 స్థానాలకు టీడీపీ అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు. మరో ఆరు స్థానాలను పెండింగ్ లో పెట్టారు. దీంతోపాటు అనంతపురం ఎంపీ అభ్యర్థిని కూడా ప్రకటించారు. ఈ తొమ్మిది మందిలో జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డిల పేర్లను ఖరారు చేశారు. తమ వారసుల కోసం జేసీ సోదరులు పోటీకి దూరంగా ఉంటామని ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జిల్లాలో ఎక్కువ మంది సిట్టింగులకే చంద్రబాబు అవకాశం కల్పించారు.

ప్రకటించిన తొమ్మిది మంది అభ్యర్థులు వీరే:

అనంతపురం ఎంపీ అభ్యర్థి – జేసీ పవన్ కుమార్ రెడ్డి
రాప్తాడు – పరిటాల సునీత
పెనుకొండ – బీకే పార్థసారథి
రాయదుర్గం – కాలవ శ్రీనివాసులు
ధర్మవరం – గోనుగుంట్ల సూర్యనారాయణ
అనంతపురం – ప్రభాకర్ చౌదరి
హిందూపురం – బాలకృష్ణ
మడకశిర – ఈరన్న
తాడిపత్రి – జేసీ అస్మిత్ రెడ్డి

Related posts